Thursday, April 25, 2024

బుల్ డల్.. నష్టాలతో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. ఈ రోజు ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగాయి. ఒకానొక సమయంలో భారీ నష్టాల్లో ఉన్న మార్కెట్లు ఆ తర్వాత కోలుకుని చివరకు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 84 పాయింట్లు నష్టపోయి 56,975కి పడిపోయింది. నిఫ్టీ 33 పాయింట్లు కోల్పోయి 17,069 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ లో ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.  ఇక, టైటాన్, విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఏసియన్ పెయింట్స్ టాప్ లూజర్స్ గా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement