Saturday, April 20, 2024

లాభాల‌తో ముగిసిన.. స్టాక్ మార్కెట్లు

నేటి స్టాక్ మార్కెట్లు లాభాల‌తో ముగిశాయి. ఈ ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు మధ్యాహ్నం తర్వాత మళ్లీ పుంజుకుంటూ చివరి అరగంటలో కొనుగోళ్ల మద్దతుతో పూర్తిగా లాభపడ్డాయి. అంతర్జాతీయంగా ప్రతికూలతలు ఉన్నప్పటికీ చివర్లో కొనుగోళ్ల అండ దొరకడం గమనార్హం. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 223 పాయింట్లు లాభపడి 61,133కి పెరిగింది. నిఫ్టీ 69 పాయింట్లు పుంజుకుని 18,191కి చేరుకుంది. భారతి ఎయిర్ టెల్ (1.99%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.85%), టాటా స్టీల్ (1.64%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.38%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.16%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. టాటా మోటార్స్ (-1.41%), టైటాన్ (-1.10%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.76%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.65%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.63%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement