Saturday, April 20, 2024

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 953 పాయింట్లు తగ్గి 57,145 వద్ద ముగిశాయి. నిఫ్టీ 311 పాయింట్లు తగ్గి 17,016 వద్ద ముగిశాయి. బ్యాంకు నిఫ్టీ 930 పాయింట్లు తగ్గింది. ఓ దశలో 57,708 పాయింట్ల గరిష్ఠ స్థాయిని నమోదు చేసిన సూచీ.. చివరకు 953.7 పాయింట్ల నష్టంతో 57,145 వద్ద ట్రేడింగ్‌ ముగిసింది. మరో వైపు నిఫ్టీ సైతం నష్టాల్లోనే కొనసాగింది. టాప్‌ గెయినర్స్‌గా ఏషియన్‌ పేయింట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, దివిస్‌ ల్యాబ్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌ నిలిచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement