Thursday, April 25, 2024

Crime: దుండిగల్‌లో దారుణం.. బాలికపై మారు తండ్రి అత్యాచారం

హైదరాబాద్ నగర శివార్లలోని దుండిగల్‌లో దారుణం చోటుచేసుకుంది. మల్లంపేటలో ఓ బాలికపై మారు తండ్రి అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్లితే.. దుండిగల్ పరిధిలోని మల్లంపేటలో భర్తతో విడిపోయిన ఓ మహిళ మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్నది. ఆమెకు 12 ఏళ్లు వయస్సున్న కూతురు ఉన్నది. ఆమెకు తెలియకుండా ఆ మైనరు బాలికపై మారుతండ్రి గత కొన్నిరోజులుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈ విషయం బయటికి చెప్తే చంపేస్తానని బాలికను బెదిరించడంతో ఆమె మౌనంగా ఉండిపోయింది. ఈ క్రమంలో ఆ చిన్నారి ఆరోగ్యం క్షీణించడంతో తల్లి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ పరీక్షించిన వైద్యులు బాలిక గర్భవతి అని నిర్ధారించారు. బాలికను నియడంతో అసలు విషయం బయటపడింది. దీంతో ఆమె దుండిగల్‌ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement