Friday, April 26, 2024

ఆదివాసీల కోసం బైక్‌ అంబులెన్స్‌ సర్వీస్‌ ప్రారంభం

మన్యంలో జీవిస్తున్న ఆదివాసీల కోసం సరికొత్త సేవలను ప్రారంభించింది మహారాష్ట్ర ప్రభుత్వం. ముందుగా ఈ సేవలను తలోదా, నందూర్‌బా జిల్లాల్లో ప్రారంభించారు. ఆదివాసీ గూడేలకు సరైన రోడ్డు మార్గం లేక పోవడంతో అత్యవసర పరిస్థితిలో అంబులెన్స్‌ వెళ్లలేక వైద్యం అందక చాలా మంది చనిపోయారు. దీనిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బైక్‌ అంబులెన్స్‌ సర్వీస్‌ ప్రారంభించింది. బైక్‌ అంబులెన్స్‌లో ప్రథమ చికిత్సకు అవసరమైన మందులు, ఆక్సీజన్‌ సిలిండర్‌, స్ట్రెచర్‌ సౌకర్యం అందుబాటులో ఉంచారు. బైక్‌ అంబులెన్స్‌ డ్రైవర్‌కు ప్రాథమిక చికిత్స చేసేందుకు అవసరమైన శిక్షణ కూడా ఇచ్చారు. బైక్‌ అంబులెన్స్‌ ఆదివాసీ గూడేనికి చేరగానే ముందుగా ఫస్ట్‌ ఎయిడ్‌ చేస్తారు. ఆ తర్వాత దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement