Thursday, March 28, 2024

స్టార్స్ రామ్ చ‌ర‌ణ్ , శంక‌ర్ ల‌కు – బ‌హుమ‌తిగా బాహుబ‌లి కాజా

ఓ మూవీ షూటింగ్ కోసం రాజ‌మండ్రి వెళ్లారు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్. ఈ చిత్రాన్ని త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ తెర‌కెక్కించ‌నున్నాడు. కాగా రామ్ చరణ్ అభిమానులతో ఫొటో షూట్ లో పాల్గొన్నారు. కాగా, రాజమండ్రి వచ్చిన సందర్భంగా రామ్ చరణ్ కు సురుచి సంస్థ మధురమైన కానుక అందించింది. తాపేశ్వరంలో తయారుచేసిన బాహుబలి కాజాను సురుచి సంస్థ ప్రతినిధి వర్మ షెల్డన్ హోటల్లో రామ్ చరణ్ కు అందజేశారు. రాజమండ్రి వచ్చే ప్రముఖులకు బాహుబలి కాజాను బహూకరించడం ఓ ఆనవాయతీగా వస్తోంది. గతంలో సమంత, నాగార్జున, కృతి శెట్టి, ఫరియా అబ్దుల్లా తదితర సినీ తారలు కూడా ఈ స్పెషల్ కాజా రుచి చూశారు. తాజాగా, ఈ బాహుబలి కాజాను దర్శకుడు శంకర్ కు కూడా అందజేశారు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇంకా పేరుపెట్టలేదు. రామ్ చరణ్ కు ఇది 15వ చిత్రం కావడంతో ఆర్సీ 15 వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజ్ నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement