Friday, March 15, 2024

స్టాలిన్ కి ఊర‌ట – 18 ప‌రువున‌ష్టం దావాల‌కి సంబంధించిన కేసులు కొట్టివేత‌

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ కి భారీ ఊర‌ట ల‌భించింది. ఆయ‌న‌పై ఉన్న ప‌రువున‌ష్టం దావాలకి సంబంధించిన 18కేసులు ర‌ద్దు చేస్తూ మ‌ద్రాసు హైకోర్టు తీర్పు ఇచ్చింది. అన్నాడీఎంకే హయాంలో ప్రభుత్వాన్ని, సీఎంను, సీనియర్‌ అధికారులు, మంత్రులపై అప్పటి ప్రతిపక్ష నేత స్టాలిన్‌ అనేక ఆరోపణలు చేశారు. దీంతో ఆయన మీద అన్నాడీఎంకే పాలకులు 18 పరువు నష్టం దావా కేసులు వేశారు. విమర్శలు, ఆరోపణలు చేసే హక్కు ప్రతి పక్ష నేతగా తనకు ఉందని.. ఈ కేసులను రద్దు చేయాలని కోరుతూ అప్పట్లో సీఎం స్టాలిన్‌ కోర్టు లో పిటీషన్‌ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌ పై కొంతకాలంగా విచారణ జరుగుతోంది. అదే సమయంలో డీఎంకే అధికారంలోకి రావడం, సీఎం గా స్టాలిన్‌ పగ్గాలు చేపట్టడంతో.. కేసులను ఉప సంహరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో పిటీషన్‌ విచారణను ముగించిన న్యాయమూర్తి నిర్మల్‌ కుమార్‌ తాజాగా తీర్పు ఇవ్వ‌డం విశేషం. దాంతో స్టాలిన్ కి ఊర‌ట క‌లిగింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement