Friday, March 29, 2024

ఏపీలో షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు

ఏపీలో షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవటంతో రాష్ట్రంలో పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. అన్ని పాఠశాలల్లో కోవిడ్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. ఒకవేళ కోవిడ్ కేసులు పెరిగితే అప్పుడు పరీక్షల నిర్వహణపై ఆలోచిస్తామని చెప్పారు. కోవిడ్ నిబంధనలు పాటించని విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీఎం జగన్‌తో సమీక్ష జరిపి పరీక్షల నిర్వహణపై చర్చిస్తామన్నారు. ఇప్పటికయితే యథావిథిగా షెడ్యూల్ ప్రకారమే అన్ని పరీక్షలు జరిపే ఆలోచనలో ఉన్నామని ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.

కాగా, కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో CBSE బోర్డు పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రధాని మోదీతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మరి ఏపీ, తెలంగాణలో స్టేట్ బోర్డులు పదో తరగతి పరీక్షలపై ఏ నిర్ణయం తీసుకోనున్నాయి? అని ప్రచారం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement