Saturday, April 20, 2024

2007 తర్వాత ఇదే తొలిసారి.. శ్రీశైలం డ్యాం 10 గేట్లు ఎత్తివేత

ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటంతో అధికారులు బుధవారం సాయంత్రం క్రమంగా 10 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. 2007 తర్వాత జూలై నెలలో శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తడం ఇదే తొలిసారి కావడం విశేషం.

శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 885 అడుగులు (215 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 881.50 అడుగులు (196 టీఎంసీలు)గా ఉంది. ఇన్‌ఫ్లో 4.65 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఎగువ తుంగభద్ర, జూరాల, సుంకేశుల నుంచి భారీగా ఇన్‌ఫ్లో వస్తుండటం ఇప్పటికే శ్రీశైలం నిండటంతో ఇక వచ్చిన వరద వచ్చినట్లు నాగార్జున సాగర్‌కు చేరనుంది. శ్రీశైలం రిజర్వాయర్‌లో వరద ప్రవాహం ఇదే రీతిలో కొనసాగితే మరో వారంలో నాగార్జున సాగర్‌ డ్యాం సైతం నిండే అవకాశం ఉంటుంది.

ఈ వార్త కూడా చదవండి: హెపటైటిస్ లక్షణాలు ఏంటి? చికిత్స ఎలా చేస్తారు?

Advertisement

తాజా వార్తలు

Advertisement