Saturday, April 20, 2024

Ind Vs Sl: శ్రీలంకతో భారత్‌ రెండో టెస్టు

భారత్ – శ్రీలంక మధ్య నేడు రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. నేటి నుంచి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జరగనుంది.  మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ టెస్టు మ్యాచ్‌ కు 100 శాతం ప్రేక్షకులను అనుమతి ఇచ్చింది. మొదట 50 శాతం ప్రేక్షకులకే అనుమతి ఇవ్వగా… కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టడంతో 100 శాతం అనుమతి ఇచ్చారు.

తొలి టెస్టులో విజయం సాధించిన భారత్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. అయితే, సిరీస్ సమం చేయడానికి లంక గట్టి పట్టుదలతో ఉంది. తొలి టెస్టులో శ్రీలంక ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఓడిపోయింది. తాజా ఫామ్, బలాబలాల దృష్ట్యా ప్రత్యర్థికంటే ఎంతో పటిష్టంగా ఉన్న టీమిండియాకు ఇక్కడా అడ్డు ఉండకపోవచ్చు.  రోహిత్‌తో పాటు సొంతగడ్డపై మయాంక్‌ అగర్వాల్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించే అవకాశం ఉంది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement