Saturday, April 20, 2024

పావురంతో గూఢ‌చ‌ర్యం.. కాళ్ల‌కి కెమెరా.. మైక్రోచిప్

ఓ పావురం కాళ్ల‌కి కెమెరా..మైక్రోచిప్ వంటి ప‌రిక‌రాలు అమ‌ర్చి ఉన్నాయి. ఈ పావురాన్ని పారాదీప్ తీరంలో స్వాధీనం చేసుకున్నారు.పావురం రెక్కలపై అర్థం కాని భాషలో ఏదో రాసి ఉంది. ఈ నేపథ్యంలోనే పక్షిని గూఢచర్యానికి ఉపయోగిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం సముద్రంలో చేపల వేటకు వెళ్లిన కొందరు మత్స్యకారులు తమ ట్రాలర్‌పై పావురం కూర్చున్నట్లు గుర్తించారు. పక్షిని పట్టుకుని మెరైన్ పోలీసులకు అప్పగించారు.
ఈ ఘటనను పోలీసులు కూడా ధ్రువీకరించారు. పశువైద్యులు పక్షిని పరీక్షిస్తారు. దాని కాళ్ళకు అమర్చిన పరికరాలను పరిశీలించడానికి మేం రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీని ఆశ్రయిస్తాం. పరికరాలు కెమెరా, మైక్రోచిప్ అని తెలుస్తోంద‌ని జగత్‌సింగ్‌పూర్ పోలీసు సూపరింటెండెంట్ రాహుల్ పీఆర్ తెలిపారు. స్థానిక పోలీసులకు తెలియని భాషలో పక్షి రెక్కలపై ఏదో రాసినట్లు కూడా కనిపిస్తుందని చెప్పారు. ఏం రాశారో తెలుసుకోవడానికి నిపుణుల సహాయం కూడా తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement