Thursday, April 18, 2024

RRRకు ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలకు ప్రత్యేక టీమ్ ఏర్పాటు

సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుప‌త్రిలో ఎంపీ ర‌ఘురామ‌ కృష్ణంరాజుకు వైద్య ప‌రీక్ష‌లు చేస్తున్నారు. ముగ్గురు డాక్ట‌ర్ల‌తో కూడిన ప్ర‌త్యేక టీం ఆయ‌న‌కు వైద్య ప‌రీక్ష‌లు చేయ‌నుంది. సుప్రీం ఆదేశాల మేర‌కు తెలంగాణ హైకోర్టు జ్యుడిషియ‌ల్ అధికారిగా హైకోర్టు జ్యూడిషియ‌ల్ రిజిస్ట్రార‌ర్ నాగార్జున‌ను నియ‌మించింది. ఆయన ఆధ్వ‌ర్యంలో ముగ్గురు డాక్ట‌ర్ల బృందం వైద్య ప‌రీక్ష‌లు చేయ‌నుంది. ఈ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేయ‌నుండ‌గా ఎంపీ ర‌ఘురామ తనుకున్న ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను జ్యుడిషియ‌ల్ అధికారికి చెప్తే త‌ను వైద్యుల‌చే వైద్య స‌హాయం అందేలా చూడ‌నున్నారు. కాగా సోమవారం రాత్రి ఎంపీ ర‌ఘురామ‌ను గుంటూరు జైలు నుండి సికింద్రాబాద్ ఆర్మీ ఆసుప‌త్రికి త‌ర‌లించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement