Thursday, April 25, 2024

Good News: మూడ్రోజుల ముందే పలకరించిన నైరుతి.. కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు

నైరుతి ముందుగానే పలకరించింది. కేరళ తీరాన్ని సాధారణంకంటే మూడు రోజులు ముందుగానే రుతుపవనాలు (Southwest Monsoon) వచ్చాయి. కేరళ తీరాన్ని నైరుతి తాకినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంగా జూన్‌ 1న కేరళకు చేరుకుంటాయని వాతావరణశాఖ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర తెలిపారు. ఈ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను కారణంగా గత నెల నుంచి రుతుపవనాల్లో వేగం పెరిగిందని ఐఎండీ చెబుతోంది.

అయితే చెప్పిన సమయానికి కంటే ముందే రుతుపవనాలు వచ్చేశాయని అంటున్నారు అధికారులు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని గతంలో ఐఎండీ వెల్లడించింది. కాగా, సాధారణం కంటే చాలా ముందుగానే అండమాన్ నికోబార్ దీవులను రుతుపవనాలు తాకాయని మృత్యుంజయ్‌ తెలిపారు. నైరుతి రుతుపవనాల రాకతో వ్యవసాయ పనులు మరింత స్పీడ్​ చేయడానికి రైతులు సన్నాహాలు చేసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement