Thursday, April 25, 2024

SA vs IND: తొలి వన్డేలో టీమిండియా ఓటమి

దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన తొలి వన్డేలో భారత్‌ 31 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. అనంతరం 297 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్.. 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు మాత్రమే చేసింది.

భారత బ్యాట్స్ మెన్లలో ధావన్ 79, కోహ్లీ 51, రిషభ్ పంత్ 16, శ్రేయస్ అయ్యర్ 17, కేఎల్ రాహుల్ 12, వెంకటేశ్ అయ్యర్ 2, అశ్విన్ 7, శార్దూల్ ఠాకూర్ 50, భువనేశ్వర్ కుమార్ 4, బుమ్రా 14 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎన్గిడి, షంషీ, పెహ్లూక్వాయోలు చెరో 2 వికెట్లను తీయగా… మార్క్ రామ్, కేశవ్ మహరాజ్ లు చెరొక వికెట్ తీశారు.

దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్లలో.. వాన్‌ డర్‌ డసెన్‌ 129, కెప్టెన్‌ తెంబా బవుమా 110 పరుగులు చేశారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 30.4 ఓవర్లలో 204 పరుగులు జోడించారు. 129 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ డుస్సేన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. కాగా, దక్షిణాఫ్రికా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement