మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్, సౌతాఫ్రికా జట్లు ఇవ్వాల మూడో మ్యాచ్ ఆడుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్జైట్లీ స్టేడియంలో జరుగుతున్న కీలక మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే.. ఫస్ట్ బ్యాటింగ్కు దిగిన సఫారీలను ఊచకోత కోస్తున్నారు భారత బౌలర్లు. 50 ఓవర్ల మ్యాచ్లో 25 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి సఫారీలు 9 వికెట్లు కోల్పోయి కేవలం 99 పరుగులు మాత్రమే చేశారు. ఆ తర్వాత మరో వికెట్ కుల్దీప్ పడగొట్టడంతో సఫారీల ఆట ముగిసింది. ఇందులో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 2, మహ్మద్ సిరాజ్ 2 వికెట్లు, శాబాజ్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టారు.
ఇక సౌతాఫ్రికా బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసేన్ మాత్రమే (34) అత్యంత ఎక్కువ పరుగులు చేశాడు. ఇక.. మలాన్ (15), క్వింటన్ డికాక్ (6), హెడ్రిక్స్ (3), మార్ర్కమ్ (9), డేవిడ్ మిల్లర్ (7), ఆండిలే (5), మార్కో జాన్సన్ (14), ఫోర్టియాన్ (1), నోర్తుజా (0) పరుగులు మాత్రమే చేశారు. ఇక ఇండియా టార్గెట్ 100 పరుగులు చేయాల్సి ఉంటుంది. కాగా, 50 ఓవర్ల మ్యాచ్ మొత్తం 27 ఓవర్లలోనే పూర్తి చేసి ఇండియా కుర్రాళ్లు బ్యాటింగ్ దిగేందుకు రెడీ అయ్యారు.