Thursday, April 25, 2024

Big Breaking: 99 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్​.. ఉచకోత కోసిన టీమిండియా బౌలర్లు

మూడు వన్డేల సిరీస్​లో భాగంగా భారత్​,  సౌతాఫ్రికా జట్లు ఇవ్వాల మూడో మ్యాచ్​ ఆడుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్​జైట్లీ స్టేడియంలో జరుగుతున్న కీలక మ్యాచ్​లో టాస్​ గెలిచిన భారత్​ బౌలింగ్​ ఎంచుకుంది. అయితే.. ఫస్ట్​ బ్యాటింగ్​కు దిగిన సఫారీలను ఊచకోత కోస్తున్నారు భారత బౌలర్లు. 50 ఓవర్ల మ్యాచ్​లో 25 ఓవర్లు కంప్లీట్​ అయ్యేసరికి సఫారీలు 9 వికెట్లు కోల్పోయి కేవలం 99 పరుగులు మాత్రమే చేశారు. ఆ తర్వాత మరో వికెట్​ కుల్దీప్​ పడగొట్టడంతో సఫారీల ఆట ముగిసింది. ఇందులో కుల్దీప్​ యాదవ్ ​4 వికెట్లు, వాషింగ్టన్​ సుందర్​ 2, మహ్మద్​ సిరాజ్​ 2 వికెట్లు, శాబాజ్​ అహ్మద్​ 2 వికెట్లు పడగొట్టారు.

ఇక సౌతాఫ్రికా బ్యాటర్లలో హెన్రిచ్​ క్లాసేన్​ మాత్రమే (34) అత్యంత ఎక్కువ పరుగులు చేశాడు. ఇక.. మలాన్​ (15), క్వింటన్​ డికాక్​ (6), హెడ్రిక్స్​ (3), మార్ర్కమ్​ (9), డేవిడ్​ మిల్లర్​ (7), ఆండిలే (5), మార్కో జాన్సన్​ (14), ఫోర్టియాన్​ (1), నోర్తుజా (0) పరుగులు మాత్రమే చేశారు. ఇక ఇండియా టార్గెట్​ 100 పరుగులు చేయాల్సి ఉంటుంది. కాగా, 50 ఓవర్ల మ్యాచ్​ మొత్తం 27 ఓవర్లలోనే పూర్తి చేసి ఇండియా కుర్రాళ్లు బ్యాటింగ్​ దిగేందుకు రెడీ అయ్యారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement