Saturday, April 20, 2024

మన్నిస్తారా… మూగజీవులారా…

అమిత్‌ తివారీ, భానుశ్రీ, నాజర్‌, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్‌, కాలకేయ ప్రభాకర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నల్లమల’. నల్లమల అడవి చుట్టూ జరిగిన ఎన్నో చీకటి కోణాలను, సామాన్య జనానికి తెలియని అవినీతి ఒప్పందాల నేపథ్యంలో ఆసక్తికర కథా కథనాలతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రవిచరణ్‌ దర్శకత్వంలో ఆర్‌.ఎమ్‌ నిర్మించారు. ఈ సినిమాలోని సిద్‌ శ్రీరామ్‌ పాడిన ”ఏమున్నవే పిల్లా….” పాట మిలియన్స్‌ కి పైగా వ్యూస్‌ సాధించి సోషల్‌ మీడియాలో సంచలనం నెలకొల్పింది.

తాజాగా ఈ చిత్రంలోని ”మన్నిస్తారా మూగజీవులారా…” పాటను దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు విడుదలచేశారు. ఈ సందర్భంగా దర్శకేంద్రుడు మాట్లాడుతూ ”దర్శకుడు రవిచరణ్‌ మన్నిస్తారా పాటను చాలా బాగా చిత్రీకరించాడు. అప్పుడప్పుడు నల్లమల సినిమా ప్రోమోస్‌ చూస్తుంటాను. కొత్త బ్యాక్‌డ్రాప్‌లో చాలా ఆసక్తిగా తీశారు ఎవరా? అని వాకబు చేస్తే ఈ బ్యానర్‌ గురించి తెలిసింది. ”మన్నిస్తారా మూగజీవులారా… ” పాట ప్రతి లైన్‌ విని అర్ధం చేసుకుంటే హృదయం ద్రవిస్తుంది. జంతువుల పట్ల ఎంత అమానుషంగా ఉంటున్నామో తెలుస్తుంది. ఇలాంటి సబ్జెక్ట్‌ సెలక్ట్‌ చేసుకున్న నల్లమల టీమ్‌ను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను” అన్నారు

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement