Friday, March 29, 2024

మీరు ఏమి లీజులు ఇచ్చారో చెప్పమంటారా ?: వైసీపీకి సోము వార్నింగ్

వైసీపీ నేతలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. నా తమ్ముడి పేర్ని నానికి వినమ్రంగా చెప్తున్నా.. మాట్లాడే ముందు అన్నీ తెలుసుకుని మాట్లాడాలని అంటూ హితవు పలికారు. ‘’పేర్ని నాని నోరు అదుపులో పెట్టుకోవాలి. మా తమ్ముడు మంత్రి కొడాలి నానికి  చేతికి తాళ్లు ఎక్కువ బ్రెయిన్ తక్కువ’’ అని వ్యాఖ్యానించారు. తమ పార్టీని ఎవరో ఎంపీకి లిజ్‌కి ఇచ్చామని మాట్లాడారని మండిపడ్డారు. ఎలక్షన్ ముందు తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వచ్చిన వారికి మీరు ఏమి లీజులు ఇచ్చారో చెప్పమంటారా ? అని అడిగారు. మీ లీజులు గురించి తాము మాట్లాడితే చొక్కాలు ఊడిపోతాయని వార్నింగ్ ఇచ్చారు.

కడప, తిరుపతి ఎన్నికపై చర్చిద్దాం దమ్ముంటే రండి అని సవాల్ విసిరారు. తమ్మినేని సీతారాం స్పీకర్ అన్న విషయం మర్చిపోయారని మండిపడ్డారు. స్పీకర్ తమ్మినేని స్టీల్ ప్లాంట్‌పై పోరాటం మాని తోటపల్లి, వంశధార ప్రాజెక్టులపై పోరాటం చెయాలని సోము వీర్రాజు హితవు పలికారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement