Thursday, March 28, 2024

Breaking: భట్టి విక్రమార్క పాదయాత్రకు బ్రేక్

ప్రజాసమస్యల పరిష్కారం కొరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర ఆదివారం నుంచి తాత్కాలికంగా వాయిదా వేశారు. ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీతో రేపు(ఏప్రిల్ 4) అత్యవసర సమావేశం ఉన్నందున ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ నుంచి లేఖ అందింది. దీంతో భట్టి విక్రమార్క తన పాదయాత్రను వాయిదా వేసుకొని ఢిల్లీ బయలుదేరనున్నారు. ఈ కారణంగా బోనకల్లు మండలంలో నిర్వహించే పాదయాత్రను ఆదివారం నుంచి వాయిదా వేశారు. ఏఐసిసి అధిష్టానంతో సమావేశం ముగించుకున్న తర్వాత ఢిల్లీ నుంచి నేరుగా బోనకల్ కు చేరుకొని సీఎల్పీ నేత తన పాదయాత్రను కొనసాగిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement