Thursday, April 25, 2024

Breaking | ఆరుగురు సజీవ దహనం.. హత్యా? ప్రమాదమా..!

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపల్లిలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. అర్ధరాత్రి తర్వాత రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడిపల్లి లోని ఓ గృహంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి అందులో ఉన్న ఆరుగురు సజీవ దహనం అయినట్టు తెలుస్తోంది. గ్రామానికి చెందిన మాసు శివయ్య, రాజ్యలక్ష్మి, మౌనిక, శాంతయ్య, హిమబిందు, స్వీటీ చనిపోయారు. సమాచారం అందుకున్న మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్, మందమర్రి సీఐ ప్రమోద్ రావుతోపాటు పోలీసు అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయా లేదా ఎవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతి చెందిన శాంతయ్య సింగరేణి ఉద్యోగి. కొంతకాలంగా కుటుంబ సభ్యులను కాదని శివయ్య నివాసంలో ఉంటున్నాడు. వివాహేతర సంబంధంపై కొంతకాలంగా గొడవలు నడుస్తున్నాయని స్థానికులు పేర్కొన్నారు. ఇదే క్రమంలో శాంతయ్య కుటుంబ సభ్యులు ఘాతుకానికి పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement