Thursday, April 25, 2024

మస్కిటో కాయిల్‌ పొగ పీల్చి… ఆరుగురు మృతి

మస్కిటో కాయిల్ పొగ పీల్చడంతో ఆరుగురు మృతిచెందిన ఘ‌ట‌న దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. దోమల బాధ నుంచి తప్పించుకోవడం కోసం ఉపయోగించే మస్కిటో కాయిల్ పొగ పీల్చ‌డంతో ఓకే కుటుంబంలోని ఆరుగురి ప్రాణాలు తీసింది. ఢిల్లీ సీనియర్‌ పోలీసు అధికారి జోయ్‌ టిర్కీ తెలిపిన వివరాల ప్రకారం.. శాస్త్రీ పార్క్‌ సమీపంలో నివాసముండే ఓ కుటుంబం దోమలు కుట్టకుండా ఉండేందుకు రాత్రి పడుకునే ముందు ఇంట్లో మస్కిటో కాయిల్‌ వెలిగించారు. దాన్నుంచి వచ్చిన కార్బన్‌ మోనాక్సైడ్‌ వాయువును పీల్చారు. దీంతో ఊపిరాడక నిద్రలోనే ఆ కుటుంబంలోని ఆరుగురు ప్రాణాలు విడిచినట్లు జోయ్‌ టిర్కీ వెల్లడించారు. మరణించిన ఆరుగురిలో నలుగురు పురుషులు, ఒక మహిళ, ఒక చిన్నారి ఉన్నారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నార‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement