Thursday, March 28, 2024

జైలు సిబ్బందిపై దాడి-విచార‌ణ‌లో ఉన్న ఆరుగురు ఖైదీలు పరార్

విచార‌ణ‌లో ఉన్న ఆరుగురు ఖైదీలు ..జైలు సిబ్బందిపై దాడి చేసి ప‌రార‌య్యారు.ఈ సంఘ‌ట‌న ఈశాన్య రాష్ట్రం మేఘాలయాలో చోటుచేసుకుంది. వారు జైలు నుంచి జారుకున్నట్టు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిసన్త జేర్రీ ఎఫ్‌కే మారక్ వివరించారు. ఈ ఘటన వెస్ట జైనీతియా హిల్స్ జిల్లాలో చోటుచేసుకున్నట్టు అధికారులు చెప్పారు. పక్కా ప్లాన్ ప్రకారం, వారు జైలు సిబ్బందిపై దాడి చేసి పరారయ్యారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో జిల్లా జైలు నుంచి ఆరుగురు విచారణ ఖైదీలు పారిపోయినట్టు మారక్ పీటీఐకి వెల్లడించారు. ఈ ఘటనను విచారించనున్న ఓ సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ, పరారైన విచారణ ఖైదీలు జైలు స్టాఫ్‌పై పట్టు సాధించారని, ఈ ఘటనపై సమగ్ర విచారణ త్వరలోనే పూర్తవుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement