Friday, April 19, 2024

చ‌నిపోయిన చెల్లి డెడ్‌బాడీతో నాలుగు రోజులుగా అక్క సహజీవనం

చనిపోయిన చెల్లెలితో నాలుగు రోజులుగా సోదరి కలిసివున్న ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పట్టణంలోని ప్రగతి నగర్ లో జీవిస్తున్న మారోజు శ్వేత(24) నాలుగు రోజుల క్రితం మృతి చెందింది. చెల్లెలు చ‌నిపోయిన‌ విషయం బయటకు చెప్పకుండా సోదరి స్వాతి నాలుగు రోజులుగా అదే ఇంట్లో జీవనం సాగిస్తోంది.

సోమవారం తీవ్రమైన దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్, ఎస్సై రాజేష్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. శ్వేత ఎలా మృతి చెందిందనే విషయం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement