Saturday, April 20, 2024

సార్ చిత్ర షూటింగ్ కి బ్రేక్ – ఎందుకంటే

త‌మిళ స్టార్ హీరో డైరెక్ట్ తెలుగు చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకురానున్నాడు ధ‌నుష్. ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ములాతో సినిమాని అనౌన్స్ చేసి, ఆ త‌ర్వాత మ‌రో డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరితో క‌మిట్ అయ్యాడు ధ‌నుష్. రీసెంట్ గా పూజా కార్యక్రమాలు ముగించుకుంది సార్ సినిమా. హైదరాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్.. ఇంపార్టెంట్ సీన్స్ ప్లాన్ చేసుకున్నారు. ఒక్క రోజు బాగానే షూటింగ్ జరిగింది. కాని హీరో ధనుష్ వద్దన్న కారణంగా ఈ షూటింగ్ ఆగిపోయింద‌ట‌. కరోనా భయంకరంగా విరుచుకుపడుతుండటంతో షూటింగ్ ను ఆపేసినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్స్ అంతా వరుసగా కరోనా బారిన పడుతున్నారు. రీసెంట్ గా సత్యరాజ్ కు సీరియస్ కూడా అయ్యింది. మహేష్,తమన్ లాంటి వారిని కరోనా వదిలిపెట్టలేదు. దాంతో ఇండస్ట్రీలో భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి టైమ్ లో రెగ్యూలర్ షూటింగ్ చేయడం మంచిది కాదు అని నిర్ణయింకున్నారట హీరో ధనుష్. అందుకే పరిస్థితి చక్కబడే వరకూ..షూటింగ్ పోస్ట్ పోన్ చేశారని సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement