Saturday, April 20, 2024

శిల్పా చౌద‌రిపై కేసు పెట్టిన మ‌హేశ్ బాబు సోద‌రి ప్రియ‌ద‌ర్శిని ..

శిల్పా చౌద‌రి లీల‌లు రోజుకొక‌టి బ‌య‌టికి వ‌స్తున్నాయి. గండిపేటలోని సిగ్నేచర్ విల్లాలో పదేళ్లుగా నివసిస్తున్న శిల్పా చౌదరి, శ్రీకృష్ణ శ్రీనివాస్ ప్రసాద్ దంపతులు ధనవంతులుగా చెలామణి అయ్యేవారు. టీవీ, సినీ నిర్మాతగా పరిచయం చేసుకున్న శిల్పా సినీ ప్రముఖుల కుటుంబాల్లోని మహిళలను తరచూ కలుసుకుంటూ వీకెండ్ పార్టీలకు ఆహ్వానించారు. తొలుత కొందరితోనే ఈ కిట్టీ పార్టీ మొదలు కాగా, ఆ తర్వాత ఆ ఆ పార్టీలను దివానోస్ పేరుతో పేకాట క్లబ్‌గా మార్చేశారు. ఇందులో 90 మంది వరకు సెలబ్రిటీ కుటుంబాల మహిళలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదుతో అరెస్ట్ అయిన శిల్ప ప్రస్తుతం జైల్లో ఉన్నారు.

కాగా సెల‌బ్రిటీల‌ను మోసం చేసి కోట్ల రూపాయ‌లు కొల్ల‌గొట్టిన కిలాడీ శిల్పా చౌద‌రి స్టార్ హీరో మ‌హేశ్ బాబు సోద‌రి ప్రియ‌ద‌ర్శిని నుంచి కూడా కోట్ల రూపాయ‌ల‌ను కొల్ల‌గొట్టింద‌ట‌. రెండు కోట్ల రూపాయ‌ల న‌గ‌దుని ఆమె నుంచి తీసుకున్న విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. దాందో శిల్పాపై నార్సింగి పోలీసుల‌కు ప్రియ‌ద‌ర్శిని ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement