ముంబై బ్రీచ్ కాండీ ఆస్పత్రి వైద్యులు సింగర్ లతా మంగేష్కర్ హెల్త్ బులెటిన్ ని రిలీజ్ చేశారు. నిన్నటి నుంచి ఆమె ఆరోగ్యం మెరుగుపడిందని తెలిపారు. కానీ ఆమెని ఇంకా ఐసీయూలో పరిశీలనలో ఉంచామని చెప్పారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి. ఆమె తర్వలోనే కోలుకుంటుందని ఆశిస్తున్నాం” అంటూ వైద్యులు హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు వైద్యులు. ఇక బ్రీచ్ కాండీ ఆస్పత్రి వైద్యలు తాజాగా ప్రకటించిన హెల్త్ బులిటెన్ తో లతా మంగేష్కర్ అభిమానులు, కుటుంబ సభ్యులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. లతా మంగేష్కర్ జనవరి 8 వ తేదీన కరోనా బారీన పడ్డ సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్ రావడంతో… సరిగ్గా పదిహేను రోజుల కిందట ఆమెను ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో ఆమె కుటుంబ సభ్యులు చేర్పించారు. అప్పటి నుంచి లతా మంగేష్కర్ కు.. ఐసీయూలోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..