Monday, April 22, 2024

‘ల‌తా మంగేష్క‌ర్’ హెల్త్ బులెటిన్ విడుద‌ల

సినీ సెల‌బ్రిటీలు ప‌లువురు క‌రోనా కోర‌ల్లో చిక్కుకుంటున్నారు. కాగా ప్ర‌ముఖ గాయ‌ని ల‌తా మంగేష్క‌ర్ నిన్న క‌రోనా బారిన ప‌డ్డారు. దాంతో ఆమెని ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కాగా ఆమెకి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. తాజాగా ఆమె హెల్త్ బులెటిన్ ని బ్రీచ్ క్యాండీ ఆసుప‌త్రి వైద్యులు విడుద‌ల చేశారు. గాయకురాలు లతా మంగేష్కర్ ICU వార్డులో చికిత్స పొందుతున్నారు. ఆమె మరో 10-12 రోజుల పాటు ఐసీయూలోనే ఉంటుంది. ఆమె కోవిడ్‌తో పాటు, న్యుమోనియాతో కూడా బాధపడుతోంది. ఆమెకు మంచి వైద్యం అందిస్తున్నాం” అని బ్రీచ్ కాండీ ఆస్పత్రి డాక్టర్ ప్రతీత్ సంధాని వెల్ల‌డించారు. ఇక అటు గాయని లతా మంగేష్కర్ మేనకోడలు రచన.. కూడా ఆమె ఆరోగ్యం పై స్పందించారు. ”లతా మంగేష్కర్ ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉంది. ఎవరు కూడా కంగారు పడొద్దు. ఆమె వయస్సు పెద్దది కనుక.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే… ఐసీయూలో ఉంచార‌ని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement