Thursday, April 18, 2024

Flash: హృద‌య విదార‌క ఘ‌ట‌న.. గంటల వ్యవధిలో అన్నదమ్ములు మృతి

ఇద్దరు అన్న‌ద‌మ్ములు ఒకేసారి అనంత‌లోకాల‌కు వెళ్లిన హృద‌య విదార‌క ఘ‌ట‌న మంచిర్యాల జిల్లాలోని ల‌క్సెట్టిపేట‌లో చోటు చేసుకుంది. మూడు గంటల వ్యవధిలో గుండెపోటుతో అన్నదమ్ములు చనిపోయారు. అన్న మృతిని త‌ట్టుకోలేని త‌మ్ముడు బోరున విల‌పిస్తూ గుండెపోటుకు గుర‌య్యాడు. వివరాల్లోకి వెళ్లితే.. ల‌క్సెట్టిపేట ప‌ట్ట‌ణానికి చెందిన గాజుల భాస్క‌ర్ గౌడ్(46), శ్రీనివాస్ గౌడ్ అన్న‌ద‌మ్ములు. భాస్క‌ర్ గౌడ్ గుండెపోటుతో మ‌ర‌ణించగా.. అన్న మృతి చెందాడ‌న్న వార్త శ్రీనివాస్ గౌడ్‌కు తెలిసింది. దీంతో హుటాహుటిన ల‌క్సెట్టిపేట‌కు శ్రీనివాస్ గౌడ్ చేరుకుని అన్న మృత‌దేహాన్ని చూసి బోరున విల‌పించాడు. ఈ క్ర‌మంలో శ్రీనివాస్ గౌడ్ కూడా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఒకే ఇంట్లో ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు గంట‌ల వ్య‌వ‌ధిలో గుండెపోటుతో మ‌ర‌ణించ‌డం తీవ్ర విషాదాన్ని నింపింది.

మూడు గంటల వ్యవధిలో తోబుట్టువులను పోగొట్టుకోవడంతో శ్రీనివాస్, భాస్కర్‌ల కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. వారు ఓదార్చలేనంతగా విలపించారు. ఈ మరణం అన్నదమ్ముల బంధాన్ని విడదీయలేకపోయిందని స్థానికులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement