Friday, April 19, 2024

కబ్జా నుంచి శ్రియా ఫ‌స్ట్ లుక్.. మ‌ధుమ‌తిగా అలరిస్తుందట..

సుదీర్ఘ విరామం తర్వాత, బహుభాషా నటి శ్రియా శరణ్ ఆర్.చంద్రు దర్శకత్వం వహించిన పాన్ ఇండియా ఫిల్మ్ కబ్జాలో ఉపేంద్ర, కిచ్చా సుదీప్‌లు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఏడు భారతీయ భాషల్లో విడుదల కానుంది. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీలో శ్రియా మధుమతి పాత్రలో కనిపించనుంది. ఈరోజు రివీల్ అయిన ఫ‌స్ట్ లుక్ ఆమె అభిమానులను విస్మయానికి గురి చేసింది.

పీరియాడిక్ డ్రామా అయిన కబ్జా భారీ సెట్‌లను నిర్మించి చిత్రీకరించబడింది, ఇందులో కబీర్ దుహన్ సింగ్, కామ్‌రాజ్, డానిష్ అక్తర్ సైఫీ, సునీల్ పురాణిక్, అనూప్ రేవణ్ణ, జగపతి బాబు, ప్రమోద్ శెట్టి మరియు అనేక ఇతర తారలు ఉన్నారు. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా పోస్టర్, టీజర్ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించాయి. మహమ్మారి కారణంగా సినిమా షూటింగ్‌లో జాప్యం జరిగింది. లోటుపాట్లు ఉన్నా ఈ ఏడాది చివరికల్లా సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement