Friday, April 19, 2024

య‌కీమాలో కాల్పులు.. ముగ్గురు మృతి.. ఆత్మ‌హ‌త్య చేసుకున్న దుండ‌గుడు

అమెరికాలో మ‌రోసారి కాల్పుల మోత మోగింది. వాషింగ్టన్‌లోని యకీమాలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఓ కన్వీనియెన్స్ స్టోర్‌లో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు ముగ్గురిని కాల్పి చంపిన కొన్ని గంటల తర్వాత పోలీసులు చుట్టుముట్టడంతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సర్కిల్ కె మార్కెట్‌లో తెల్లవారుజామున 3.30 గంటలకు ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడిని యకీమా కౌంటీకి చెందిన 21 ఏళ్ల జారిడ్ హడాక్‌గా గుర్తించారు. కాల్పులు యాదృచ్ఛికంగా జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడికి, బాధితులకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని పోలీసులు తెలిపారు. స్టోర్ లోపలికి నడుచుకుంటూ వెళ్లిన 21 ఏళ్ల నిందితుడు ఒక్కసారిగా కాల్పులు జరిపినట్టు చెప్పారు. స్టోర్ లోపల ఇద్దరిని కాల్చి చంపిన నిందితుడు బయటకొచ్చాక మరొకరిని కాల్చి చంపాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు అమెరికాలో 39 కాల్పుల ఘటనలు జరిగినట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement