Wednesday, April 24, 2024

FLASH: విహారయాత్రలో విషాదం.. దుబాయ్‌లో శిశసేన ఎమ్మెల్యే మృతి

విహారయాత్ర కోసం దుబాయ్‌కి వెళ్లిన ముంబైకి చెందిన ఓ శివసేన ఎమ్మెల్యే కుటుంబంలో విషాదం నింపింది. దుబాయ్ పర్యటనకు వెళ్లిన శివ‌సేన ఎమ్మెల్యే ర‌మేశ్ ల‌క్టే అక్క‌డ గుండెపోటుతో మ‌ర‌ణించారు. ఆయ‌న వ‌య‌సు 52 ఏళ్లు. ఎమ్మెల్యే ర‌మేశ్ భౌతిక‌దేహాన్ని ఈ రోజు ముంబై తీసుకొచ్చే అవకాశం ఉంది.

ముంబైలోని అంధేరి తూర్పు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యే కావ‌డానికి ముందు ఆయ‌న బీఎంసీ కార్పొరేట‌ర్‌గా కూడా చేశారు. కాంగ్రెస్‌కు చెందిన సురేష్ శెట్టిని ఓడించి, 2014లో అంధేరీ ఈస్ట్ నుంచి మహారాష్ట్ర శాసనసభకు తొలిసారిగా ఎన్నికయ్యారు. 2019లో స్వతంత్ర అభ్యర్థి ఎం పటేల్‌ను ఓడించారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC)లో అనేక పర్యాయాలు కార్పొరేటర్‌గా కూడా పనిచేశాడు. కాగా, ఎమ్మెల్యే ర‌మేశ్ మృతి ప‌ట్ల శివసేన నేతలు నివాళి అర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement