Thursday, March 28, 2024

ఆయేషాతో విడాకులు తీసుకున్న శిఖర్ ధావన్..

టీమిండియా వెటరన్‌ ఓపెనర్ శిఖర్ ధావన్ తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. శిఖర్‌ ధవన్‌ తో తన ఎనిమిదేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికినట్లు అతని భార్య, 46 ఏళ్ల ఆయేషా ముఖర్జీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. అయితే ఆయేషా ముఖర్జీకి ఇది రెండోసారి విడాకులు కావడం. ధావన్ కంటే ముందు ఒక్కరిని పెళ్లి చేసుకున్న ఆయేషా తనతో విడాకులు తీసుకోగా…భారత సంతతికి చెందిన మెల్‌బోర్న్‌ బాక్సర్‌ ఆయేషాను 35 ఏళ్ల ధవన్‌ 2012లో వివాహం చేసుకున్నాడు.

ధవన్‌ను రెండో పెళ్లి చేసుకున్న ఆయేషాకు అంతకుముందే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిని ధవన్‌ పెళ్లి సమయంలో దత్తత తీసుకున్నారు. ఇక ధవన్‌-ఆయేషా జోడీకి 2014లో ఒక మగబిడ్డ పుట్టాడు. అతడి పేరు జోరావర్‌ ధవన్‌.

గత ఏడాది విధించిన లాక్ డౌన్ సమయంలో కొడుకుతో కలిసి చేసిన ఎన్నో వీడియోలను తన సోషల్ మీడియాలో పంచుకున్నాడు శిఖర్. అయితే ఈ విడాకులకు సంబంధించిన ఎటువంటి విషయాన్ని ధావన్ ప్రకటించలేదు.

ఇక ఈ ఏడాది ఇండియా యొక్క రెండో టీంకు కెప్టెన్ గా భాధ్యతలు నిర్వర్తించిన గబ్బర్ శ్రీలంక పై వన్డే సిరీస్ లో విజయం సాధించగా… టీ20 సిరీస్ ను కోల్పోయాడు.

ఇది కూడా చదవండి: సెహ్వాగ్‌ నోట పవన్‌ కళ్యాణ్‌ మాట

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement