Wednesday, April 17, 2024

కెప్టెన్‌ ధవన్‌: శ్రీలంక టూర్‌కు భారత జట్టు ఎంపిక..

టీమిండియా సీనియర్‌ ఓపెనర్‌ తొలిసారి భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. టీమిండియా రెండో జట్టు జూలైలో శ్రీలంకలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ పర్యటనకు వెళ్లే జట్టును గురువారం బీసీసీఐ ప్రకటించింది. ధావన్‌ కెప్టెన్‌గా.. భువనేశ్వర్‌ ​కుమార్‌ వైస్‌కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

ఇక జట్టు విషయానికి వస్తే 20 మంది ఆటగాళ్లను ఎంపిక​ చేయగా.. ముందుగా ఊహించనట్టుగానే పృథ్వీ షా, పడిక్కల్‌, నితీష్‌ రాణా, సామ్సన్‌, రుతురాజ్‌, దీపక్‌ చహర్‌, చేతన్‌ సకారియాలు జట్టులో చోటు సంపాదించారు. అంతకముందు ఇంగ్లండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో ఆడిన సూర్యకుమార్‌, ఇషాన్‌ కిషన్‌లు తన స్థానాలను నిలబెట్టుకున్నారు. ఇక నెట్‌ బౌలర్లుగా  ఇషాన్‌ పొరేల్, సందీప్‌ వారియర్, అర్షదీప్‌ సింగ్, సాయి కిషోర్, సిమర్జిత్‌ సింగ్‌ ఉండనున్నారు.జూలైలో శ్రీలంకతో మూడు వన్డేలు.. మూడు టీ20లు ఆడనుంది.

జట్టు వివరాలు: ధవన్‌ (కెప్టెన్‌), భువనేశ్వర్‌ (వైస్‌ కెప్టెన్‌), పృథ్వీషా, పడిక్కల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, సూర్యకుమార్‌, మనీశ్‌ పాండే, హార్దిక్‌ పాండ్యా, నితీశ్‌ రాణా, ఇషాన్‌ కిషన్‌, శాంసన్‌, చాహల్‌, రాహుల్‌ చాహర్‌, కృష్ణప్ప గౌతమ్‌, కృనాల్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, దీపక్‌ చాహర్‌, సైనీ, చేతన్‌ సకారియా.

నెట్‌ బౌలర్లు: ఇషాన్‌ పొరేల్, సందీప్‌ వారియర్, అర్షదీప్‌ సింగ్, సాయి కిషోర్, సిమర్జిత్‌ సింగ్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement