Saturday, April 20, 2024

Breaking: తెలంగాణ కొత్త సీఎస్గా శాంతికుమారి

తెలంగాణ రాష్ట్ర‌ కొత్త సీఎస్ ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. కొత్త సీఎస్ గా శాంతికుమారి నియామకమ‌య్యారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1989 బ్యాచ్​కు చెందిన శాంతికుమారి గతంలో సీఎంవోలో కార్యదర్శిగా పని చేశారు. ప్రస్తుతం ఫారెస్ట్ డిపార్ట్​మెంట్​ స్పెషల్​ సీఎస్ గా ఉన్నారు. ఈమె ఏప్రిల్ 2025లో రిటైర్ కానున్నారు. ఈ క్రమంలో రేసులో ప్రధానంగా రామకృష్ణారావు, అరవింద్ కుమార్, శాంతికుమారి పేర్లు వినిపించాయి. తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా సీఎస్ గా శాంతికుమారి నియామకమయ్యారు. ఆమె సీఎస్ గా బాధ్యతలు స్వీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement