Thursday, March 28, 2024

షాంఘైలో లాక్‌‌డౌన్‌‌ ఎఫెక్ట్‌‌… ఆఫీసుల్లోనే నిద్రిస్తున్న ఉద్యోగులు

చైనాలో లాక్ డౌన్ కారణంగా ప్రజలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ఆ దేశంలోనే అతిపెద్ద ఆర్థిక నగరం అయిన షాంఘైలో సోమవారం నుంచి లాక్‌‌డౌన్‌‌ విధించారు. దీంతో సిటీలో ఉన్న 2.6 కోట్ల మంది ఇండ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో తమ వ్యాపార కార్యకలాపాలు సక్రమంగా జరిగేందుకు పలు కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. తమ ఉద్యోగులు ఇండ్లకు వెళ్లకుండా రాత్రిపూట ఆఫీసుల్లోనే పడుకొనే ఏర్పాట్లు చేశాయి. షాంఘైలో లాక్‌‌డౌన్‌‌ విధించడానికి ముందు కొన్ని కంపెనీలు తమ హెడ్‌‌లను, ఉద్యోగులను పిలిపించి రాత్రిపూట ఇక్కడే ఉండాలని ఆదేశాలిచ్చాయి. రాత్రిళ్లు ఉండేందుకు అవసరమైన స్లీపింగ్‌‌ బ్యాగ్‌‌లు, ఇతర సామగ్రిని సిద్ధం చేశాయి. అలాగే మరికొన్ని కంపెనీలు ఉద్యోగులను 2 టీమ్‌‌లుగా చేసి, రొటేషన్‌‌ పద్ధతిలో పనిచేయిస్తున్నాయి.

షాంఘైలోని లూజియాజుయ్‌‌ జిల్లాలో 285 ఆఫీసు టవర్లలో 20 వేల మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో బ్యాంక్‌‌ ఉద్యోగులు, ట్రేడర్స్‌‌, ఇతర వర్కర్లు ఉన్నారు. వీరందరూ ఆఫీసుల్లోనే నిద్రిస్తున్నారని స్థానిక అధికారులు వెల్లడించారు. లాక్‌‌డౌన్‌‌లో కూడా ఆర్థిక కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మరికొంత మంది వైట్‌‌కాలర్‌‌‌‌ కార్మికులు, శానిటేషన్‌‌ సిబ్బంది పనిచేస్తున్నారని ఆ జిల్లా పరిపాలన విభాగం వెల్లడించింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement