Thursday, March 28, 2024

నేటి నుంచి అయ్యప్ప భక్తులకు స్వామి దర్శనం

కేరళలోని శబరిమల అయ్యప్ప దేవస్థానం నేడు తెరుచుకుంది. నేటి నుంచి జులై 21 వరకు జరిగే పూజా కార్యక్రమాల కోసం భక్తులను ఆలయంలోకి అనుమతించనున్నారు. టీకా పొందినట్లు ధ్రువపత్రం చూపించినవారితో పాటు, కరోనా ఆర్​టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు ఉన్నవారికే దేవస్థానంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఇస్తున్నారు. ఆన్​లైన్ ద్వారా దర్శన టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అయితే రోజుకు గరిష్ఠంగా.. 5 వేల మందికి మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement