Friday, April 19, 2024

Karnataka : డివైడర్ ను ఢీకొన్న కారు.. ఏడుగురు మృతి

కర్ణాటక ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. దావణగెరె జిల్లా ననకట్టె గ్రామం వద్ద జాతీయ రహదారి 50పై శుక్రవారం ఉదయం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యక్తులు మరణించారు. ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ఈ ఘటనపై జగులూరు రూరల్ పోలీసులు ఫిర్యాదు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దావణగెరె ఎస్పీ సీబీ రిష్యంత్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement