Thursday, March 28, 2024

నిద్ర మత్తులో డ్రైవర్​.. విద్యుత్​ స్తంభాన్ని ఢీకొట్టిన వ్యాన్, ఏడుగురు మృతి.. 10 మందికి తీవ్ర గాయాలు

తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరులో పండుగవేళ ఘోరం జరిగింది. జవధుమలై ప్రాంతంలో ఓ మినీ వ్యాన్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. వ్యాన్ డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం, వాహనంపై  నియంత్రణ కోల్పోవడంతో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. స్తంభాన్ని ఢీకొట్టిన వ్యాను బోల్తాపడిపోయింది. ఈ ప్రమాదంలో 26 మంది ప్రయాణికులు చిక్కుకోగా వారిలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement