Tuesday, April 16, 2024

Crime Story | రాజేశ్​, సుజాత కేసులో సంచలన విషయాలు.. వారిద్దరూ అలా చేయాలనుకున్నారు!

హైదరాబాద్​లోని హయత్​నగర్​ ఘటనలో రాజేశ్​, టీచర్​ సుజాత ఇద్దరు కలిసి అలా చేయాలని ప్లాన్​ చేసుకున్నారు. వీరిద్దరు ఫోన్​లను పరిశీలించిన తర్వాత పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో పలు సంచలన విషయాలను పోలీసులు వెలువరించారు. ఏడాది క్రితం రాజేశ్​, టీచర్​ సుజాత మధ్య ఓ రాంగ్​ పోన్​కాల్​ అనుబంధం పెంచింది. అప్పటి నుంచి వీరిద్దరూ తరుచుగా కలుసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే.. సుజాతపై రాజేశ్​ అమితంగా ప్రేమను పెంచుకున్నాడని, దాంతో ఆమె ఎటూ తోచని పరిస్థితుల్లో ఈ డిసిషన్​ తీసుకున్నట్టు అవగతం అవుతోంది.

రాజేశ్, టీచర్ సుజాత మధ్య ఏం జరిగింది, ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు ఆధారాలు సేకరించారు. దర్యాఫ్తు ఓ కొలిక్కి రావడంతో వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఏడాదిన్నర క్రితం మిస్ట్ కాల్ ద్వారా వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఇల్లిసిట్​ రిలేషన్​కి దారి తీసింది. ఈ నెల 24వ తేదీన చివరిసారిగా కలుసుకొని, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకోవాలని వారు ప్లాన్​ చేసుకున్నారు.

అయితే.. అంతకుముందే టీచర్ పేరు మీద హయత్ నగర్ లోని ఓ దుకాణంలో రాజేశ్ పురుగుల మందు కూడా కొనుగోలు చేశాడు. 24వ తేదీని ఇంటికి వెళ్లాక టీచర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసింది. ఇక.. అదే రోజు రాజేశ్ కూడా పురుగుల మందు తాగాడు. ఈ క్రమంలో టీచర్ భర్త ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. కాగా, రాజేశ్ కూడా చికిత్స పొందుతూ చనిపోయాడు. వారిద్దరి ఫోన్లలో ఉన్న పూర్తి వివరాలతో పోలీసులు కేసును ఛేదించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement