Tuesday, April 23, 2024

చ‌రిత్ర సృష్టించిన అమ‌లాపురం కుర్రాడు-భార‌త్ కి కాంస్య ప‌త‌కం

మ‌హారాష్ట్ర‌కి చెందిన త‌న స‌హ‌చ‌రుడు చిరాగ్ షెట్టితో క‌లిసి ప్ర‌తిష్టాత్మ‌క బీడ‌బ్ల్యూ ఎఫ్ వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్ షిప్ లో సెమీ ఫైన‌ల్ కి చేరుకున్నాడు అమలాపురం కుర్రాడు, భారత డబుల్స్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్. ఈ మేర‌కు కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. ఈ టోర్నీ చరిత్రలో పతకం అందుకోబోతున్న భారత మెన్స్ డబుల్స్ తొలి జోడీగా సాత్విక్- చిరాగ్ శెట్టి జంట రికార్డు కెక్కనుంది. ఓవరాల్ గా ఈ మెగా టోర్నీ డబుల్స్ విభాగంలో భారత్ కు ఇది రెండో పతకం కానుంది. 2011లో గుత్తా జ్వాల- అశ్విని పొన్నప్ప జోడీ మహిళల డబుల్స్ లో కాంస్య పతకం సాధించింది. టోక్యో వేదికగా జరుగుతున్న తాజా టోర్నీలో భారత్ నుంచి సాత్విక్- చిరాగ్ జంట మాత్రమే మిగిలింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ఈ జంట 24-22, 15-21, 21-14తో జపాన్ కు చెందిన టకుర హొకి- యుగో కొబయాషి జంటపై మూడు గేమ్స్ పై పోరాడి అద్భుత విజయం సాధించింది. శనివారం జరిగే సెమీఫైనల్లో భారత జోడీ… మలేసియాకు చెందిన ఆరో సీడ్ జోడీ ఆరోన్ చియా- సో వూయి యిక్ ద్వయంతో అమీతుమీ తేల్చుకోనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement