Thursday, April 25, 2024

సెల్ఫీ తీసుకుంటున్నారు.. అంతలోనే ఘోరం..

నల్లగొండ: సెల్ఫీ సరదా ఇద్దరు దోస్తుల ప్రాణం తీసింది. స్నేహితులంతా సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తూ నీళ్లలో పడి చనిపోయిన ఘటన నల్లగొండ జిల్లాలో జరిగింది. జహీరాబాద్‌కు చెందిన సాగర్‌, ప్రవీణ్ ఇద్దరూ స్నేహితులు. మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు శ్రీశైలం వెళ్లారు. తిరిగి వస్తుండగా నల్లగొండ జిల్లాలోని డిండి జలాశయం వద్ద ఆగారు. అక్కడ సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించారు. అప్పుడే ప్రమాదవశాత్తూ ఇద్దరూ జలాశయంలో పడి చనిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement