Tuesday, March 26, 2024

భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, మావోయిస్టుల‌కు మ‌ధ్య ఎదురు కాల్పులు – మావోయిస్టు మృతి

భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, మావోయిస్టుల‌కు మ‌ధ్య ఎదురు కాల్పులు జ‌రిగాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మ‌ర‌ణించాడు. కాగా మృతి చెందిన మావోయిస్టుపై రూ.5ల‌క్ష‌ల రివార్డు ఉంద‌ని అధికారి ఒక‌రు వెల్ల‌డించారు. కాగా ఈ కాల్పులు ఛ‌త్తీస్ గ‌ఢ్ లోని దంతెవాడ‌లో చోటు చేసుకుంది. మ‌ర‌ణించిన మావోయిస్టు దంతెవాడ జిల్లాలో అనేక హింసాత్మక ఘటనల్లో నిందితుడిగా ఉన్నాడట‌. జిల్లా రిజర్వ్ గార్డ్ బృందం.. నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో ఉన్నప్పుడు అరన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుర్గం గ్రామ సమీపంలోని అడవిలో కాల్పులు జరిగాయని దంతెవాడ పోలీసు సూపరింటెండెంట్ సిద్ధార్థ్ తివారీ తెలిపారు.

ఎదురుకాల్పులు ముగిసిన తర్వాత.. ఒక నక్సల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మృతుడిని 34 ఏళ్ల అర్జున్ అలియాస్ లఖ్మా సోడిగా గుర్తించినట్టుగా చెప్పారు. మావోయిస్టు మలంగర్ ఏరియా కమిటీకి మిలీషియా కమాండర్ ఇన్‌ఛార్జ్‌గా అర్జున్ చురుకుగా పనిచేశాడని.. అతను హత్య, హత్యాయత్నం, అపహరణతో సహా 13 హింసాత్మక సంఘటనలలో పాల్గొన్నాడని తెలిపారు. ఘటన స్థలం నుంచి ఒక పిస్టల్, 5 కిలోల టిఫిన్ బాంబు, నక్సల్ యూనిఫామ్, విద్యుత్ తీగలు, వైర్ కట్టర్, నక్సల్ లిటరేచర్, కొన్ని క్యాంపింగ్ మెటీరియల్‌లను స్వాధీనం చేసుకున్నట్లు వివ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement