Friday, March 29, 2024

ప్ర‌ధాని మోడీ రోడ్ షోలో భద్రతా వైఫల్యం..

ప్రధాని నరేంద్ర మోడీ కర్నాటక పర్యటనలో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. భద్రతా సిబ్బందిని దాటుకొని ఓ వ్యక్తి దూసుకొచ్చాడు. ప్రధాని మోడీకి దండ వేసేందుకు ప్రయత్నించాడు. వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మోడీ టూర్‎లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది. కర్ణాటకలో రోడ్ షో నిర్వహిస్తున్న మోడీ… 29వ జాతీయ యువనోత్సవాలను ప్రారంభించారు. బెంగళూరు, హుబ్బలిలో భారీ ఎత్తున జరిగిన రోడ్ నిర్వహించారు. దాదాపు ఈ ఉత్సవాల్లో 30వేల మంది యువతీ, యువకులు పాల్గొన్నారు. యువనోత్సవాలను పురష్కరించుకొని కర్నాటక ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో భ‌ద్ర‌తా వైఫ‌ల్య‌ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement