Thursday, April 18, 2024

దేశంలో రెండో గ్రీన్ ఫంగస్ కేసు..

పంజాబ్‌లోని జలంధర్‌లో గ్రీన్‌ ఫంగస్‌ రెండో కేసు నమోదైంది. గ్రీన్ ఫంగస్‌ మొదటి కేసు మూడు రోజుల కిందట ఇండోర్‌లోని శ్రీ అరబిందో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌లో గుర్తించారు. జలంధర్‌లో రెండో కేసును గుర్తించగా.. వైద్యులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌తో పంజాబ్‌ అల్లాడిపోయింది. ఇప్పుడిప్పుడే పాజిటివ్‌ కేసులు తగ్గుతున్న క్రమంలోనే గ్రీన్‌ ఫంగస్‌ కేసు నమోదవడంపై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా హాస్పిటల్‌ చీఫ్‌ అడ్మినిస్ట్రేటర్‌ గ్రేస్‌ మాట్లాడుతూ మార్చి నెలలో రోగికి కరోనా నిర్ధారణ అయ్యిందని, తర్వాత కోలుకున్నాడని తెలిపారు. కానీ, ప్రస్తుతం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంతో ఈ నెల 14న అతని కుటుంబీకులు ఆసుపత్రికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఆసుపత్రి డాక్టర్‌ అశుతోష్‌ పరీక్షలు చేసి.. ఊపిరితిత్తుల్లో ఫంగస్‌ను గుర్తించారని, నమూనాలు సేకరించి ప్రైవేటు ల్యాబ్‌కు పంపగా.. శనివారం వచ్చిన నివేదికల్లో గ్రీన్‌ ఫంగస్‌గా నిర్ధారణ అయ్యిందని చెప్పారు. ప్రస్తుతం అతనికి చికిత్స కొనసాగుతుందని చెప్పారు. కేసుకు సంబంధించిన నివేదికను కలెక్టర్‌, సివిల్‌ సర్జన్‌, చండీగఢ్‌ నోడల్‌ అధికారికి పంపినట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement