Thursday, April 25, 2024

Covishield: వ్యాక్సిన్‌ డోసుల మధ్య వ్యవధి తగ్గింపు

భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారు చేస్తోన్న కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసుల మధ్య వ్యవధిని తగ్గించింది. రెండు డోసుల మధ్య ఉన్న 12-16 వారాల (84రోజులు) గడువును 8-16 వారాలకు కుదించింది. ఈ మేరకు నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ (NTAGI) సంస్థ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. మరోవైపు భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా రెండు డోసుల మధ్య గడువు మాత్రం ఒకేవిధంగా ఉంచింది. ప్రస్తుతం మొదటి డోసు తీసుకున్నా 28 రోజుల తర్వాత కొవాగ్జిన్‌ రెండో డోసు అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement