Thursday, April 18, 2024

ఏపీలో ఈనెల 16 నుంచి స్కూళ్లు రీ ఓపెన్

ఏపీలో స్కూళ్ల రీ ఓపెన్‌పై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. ఈ నెల 16 నుంచి స్కూళ్లను రీ-ఓపెన్ చేస్తున్నట్లు వెల్లడించారు. రెగ్యులర్ టైమింగ్సులోనే స్కూళ్లను రన్ చేస్తామని, కోవిడ్ ప్రొటోకాల్ పాటించేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి సురేష్ పేర్కొన్నారు. ఇప్పటివరకు ఏపీ వ్యాప్తంగా 95 శాతం మంది టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తయిందని తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకోని మిగిలిన టీచర్లకు కూడా టీకాలు వేయాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించామన్నారు.

ఏపీలో ఆన్ లైన్ తరగతులు ఎక్కడా జరగడం లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ వివరించారు. ప్రైవేట్ పాఠాశాలల్లో ఆన్ లైన్ తరగతులు నడపొద్దని ఆదేశించామన్నారు.ఈ నెల 16 నుంచి ఆఫ్ లైన్‌లోనే పూర్తి స్థాయిలో పాఠశాలలను నిర్వహిస్తామన్నారు. పాఠశాలలో తప్పనిసరిగా కరోనా నియమ నిబంధనలను పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా మాస్కులు, శానిటైజర్‌లు వాడటం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు.

ఈ వార్త కూడా చదవండి: హైకోర్టులో విజయసాయిరెడ్డికి చుక్కెదురు

Advertisement

తాజా వార్తలు

Advertisement