Saturday, April 20, 2024

ట్విట‌ర్ లో మ‌హేశ్ బాబు – స‌ర్కారు వారి పాట ప్ర‌మోష‌న్ కోస‌మే

స‌ర్కారు వారి పాట చిత్రాన్ని ఓ రేంజ్ లో ప్ర‌మోట్ చేస్తున్నారు సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు. ఈ చిత్రం ఈ నెల 12న రిలీజ్ కానుంది. ఇంటర్వ్యూల నుంచి మొదలు పెట్టిన సూపర్ స్టార్..మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో ముచ్చిటించే వరకు వచ్చేశారు. ట్విట్టర్ వారు ఈ పిక్చర్ కోసం ఎమోజీని కూడా ఇవ్వడం విశేషం. ఓ రీజినల్ ఫిల్మ్ కు ఇటువంటి ఎమోజీ రావడం ప్రత్యేకం. కాగా, సదరు ఎమోజీని ప్రతీ ఒక్కరు ట్విట్టర్ లో వాడాలని సూచించారు సూపర్ స్టార్. ట్విట్టర్ ఇండియా వారు తాజాగా మహేశ్ బాబుతో స్పెషల్ వీడియోను రెడీ చేయించారు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండవుతోంది. ట్విట్టర్ వారు మహేశ్ ను పలు ప్రశ్నలు అడగగా, వాటికి ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. తన గురించి నిర్వచించాలని అడగగా ‘కామ్ అండ్ ఫోకస్డ్’ అని చెప్పిన ప్రిన్స్..తన డీఎం లాక్ అయిందన్నాడు. తనను తాను స్మైల్ ఎమోజీతో నిర్వచించుకున్నాడు. సర్కారు వారి పాట’ పిక్చర్ ను ట్వీట్ రూపంలో తెలపాల్సి వస్తే ‘నా అభిమానులు బ్లాస్ట్ చేస్తారనే నమ్మకం ఉందని’ ధీమా వ్యక్తం చేస్తారు. మహేశ్ ట్విట్టర్ ఇండియాతో ఇంటరాక్ట్ అయిన ప్రజెంట్ నెట్టింట తెగ వైరలవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement