Thursday, April 25, 2024

హైద‌రాబాద్ అన్న‌పూర్ణ స్టూడియోలో ‘స‌ర్కార్ వారి పాట’ షూట్

ప‌ర‌శురామ్ తెర‌కెక్కిస్తోన్న స‌ర్కారువారి పాట షూటింగ్ హైద‌రాబాద్-అన్న‌పూర్ణ స్టూడియోలో జ‌రుగుతోంది. కాగా హీరో మహేశ్ బాబు మోకాలు నొప్పి కారణంగా ఒక యాక్షన్ సీక్వెన్స్ ను వాయిదా వేశారు. ఆ తరువాత మహేశ్ బాబు మోకాలు సర్జరీ చేయించుకోవడం .. కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకోవడం జరిగిపోయాయి. అందుకే ఇప్పుడు ఆ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు. మహేశ్ బాబు తదితరులపై చిత్రీకరణ కొనసాగుతోంది. మే 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ – 14 రీల్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మహేశ్ కూడా ఒక నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ సందడి చేయనుంది. సముద్రఖని ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకి, వెన్నెల కిశోర్ కామెడీ హైలైట్ గా నిలుస్తుందని చెప్పుకుంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement