Thursday, April 25, 2024

సంగం డెయిరీ సర్వర్లు హ్యాక్

సంగం డెయిరీ ఛైర్మన్, టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ప్రస్తుతం ఏసీబీ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు సంగం డెయిరీ సర్వర్లకు సంబంధించి వివాదం కొనసాగుతోంది. సర్వర్లను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు పోలీసులు యత్నస్తుండగా… డెయిరీ యాజమాన్య అభ్యంతరం తెలుపుతున్నారు. ఇంకోవైపు డెయిరీ సర్వర్లు హ్యాక్ అయ్యాయి. డెయిరీలోకి ప్రైవేటు వ్యక్తులను నిలువరించిన రెండో రోజే సర్వర్లు హ్యాక్ అయ్యాయని… ఇది రాష్ట్ర ప్రభుత్వం వెనుకుండి నడిపిస్తున్న కుట్ర అని యాజమాన్యం ఆరోపిస్తోంది. కోర్టు ఆర్డర్లు రాకముందే సర్వర్లను తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని యాజమాన్యం చెప్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement