Saturday, April 20, 2024

స‌మంత‌కి ఇన్ స్టా గ్రామ్ లో 20మిలియ‌న్స్ ఫాలోవ‌ర్స్ .. అభిమానానికి థ్యాంక్స్ ..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత సోష‌ల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే. ఆమె రీసెంట్ గా ఓ అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకుంది. ఇన్ స్టా గ్రామ్ లో 20మిలియ‌న్స్ ఫాలోవ‌ర్స్ మార్క్ కి చేరుకుంది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఓ ఫొటోని షేర్ చేసుకుంది స‌మంత‌. . తనను అభిమానిస్తున్న వారందరికీ థ‍్యాంక్స్‌ అంటూ పోస్ట్‌ చేసింది సామ్‌. స‌మంత కంటే.. ముందుగా ఇన్ స్టా గ్రామ్ లో రష్మిక మంధనా (2.4 కోట్లు), కాజల్‌ అగర్వాల్‌ (2.2 కోట్లు)తో ముందు వరుసలో ఉన్నారు. అయితే త‍్వరలో సామ్‌ వీరిని కూడా దాటేసి ముందుకెళ్తుందేమో చూడాలి. ఈ మ‌ధ్య వ‌రుస‌గా సినిమాలు, వెబ్ సిరీస్ , స్పెష‌ల్ సాంగ్స్ చేస్తూ త‌న దూకుడు పెంచింది. సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతున్న‌ “పుష్ప: ది రైజ్”లో స్పెషల్ సాంగ్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ‘పుష్ప’ సెట్స్‌లో చేరిన సామ్, బన్నీపై మేకర్స్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగ్ కోసం భారీ మొత్తంలో పారిదోష‌కం తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement