Friday, April 26, 2024

Samanta: చార్ ధామ్ యాత్ర‌లో స‌మంత‌.. బెస్ట్ ఫ్రెండ్ తో కలిసి స్ప్రిచ్‌వ‌ల్ టూర్‌

సమంత స్ప్రిచ్‌వ‌ల్ టూర్‌ వెళ్లింది. తన బెస్ట్ ఫ్రెండ్ శిల్పారెడ్డితో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తోంది. దీనికి సంబంధించి ఉత్తరాఖండ్ లోని చార్ ధామ్ యాత్ర‌ ఫొటోను సోష‌ల్ మీడియాలో పెట్టింది. తీర్థయాత్రలో భాగంగా తన స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి సమంత ‘యమునోత్రి’కి వెళ్లింది. ఈ విషయాన్ని శిల్పారెడ్డి తన ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించింది. హెలికాప్టర్ ముందు సమంతతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేసి.. ‘టేకాఫ్.. మొదట యమునోత్రికి వెళ్తున్నాం’ అంటూ మెసేజ్ చేసింది.

ఇన్ స్టా స్టోరీస్ లో దైవదర్శనం అనంతరం దిగిన ఫొటోను పెట్టింది. ‘చార్ ధామ్ యాత్ర.. ఎప్పటికీ మన స్నేహం చెరిగిపోదు’ అని పేర్కొంది. టూర్ లో భాగంగా గంగానది తీరాన్ని, అక్కడి వశిష్ఠ మహర్షి గుహలను వారు సందర్శించారు. ఆ ఫొటోలను, వీడియోలను శిల్పారెడ్డి ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ చేసింది. కాగా, వ్యక్తిగత కారణాలతో ఈ మ‌ధ్య‌ నాగచైతన్యతో సామ్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement